పవన్‌పై కత్తి, తమ్మారెడ్డి ప్రశంసలు!



పవన్‌పై కత్తి, తమ్మారెడ్డి ప్రశంసలు!












జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ తెలుగు దేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్ చేసే అవినీతి మీకు తెలుసా? అంటూ చంద్రబాబు మీదే విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఇప్పటి దాకా మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య దూరం పెరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌పై విమర్శలకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆయనకు అసలు అవగాహన ఉందా..? వైసీపీ, జనసేనలతో కలిసి బీజేపీ పెద్ద కుట్ర పన్నిందంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.




పవన్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం కొందరికి రుచించకపోగా.. మరికొందరు మాత్రం జనసేనానిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్‌‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ చాలా బాగా మాట్లాడారంటూ కితాబిచ్చారు. పవన్ ప్రశ్నించిన విధానానికి తమ్మారెడ్డి హ్యాట్సాప్ చెప్పారు. పవన్ మాట మీద నిలబడాలని, వెనక్కి తగ్గకుండా పోరాడితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే ఆశాభావాన్ని తమ్మారెడ్డి వ్యక్తం చేశారు.
వేరే ఎవరూ మాట్లాడినా మీడియా పెద్దగా పట్టించుకోదు. కానీ పవన్ కల్యాణ్ మాట్లాడంతో అన్ని ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పవన్ మాట మీద నిలబడి పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని తమ్మారెడ్డి చెప్పారు.
‘పవన్ తీసుకున్న స్టాండ్ ఎప్పటికీ నిన్నటి లాగానే ఉండాలి. స్టాండ్ మార్చకుండా ఉండి.. ఆయన తెలుగు రాష్ట్రాలకు మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నా. ఆయనకంత పవర్ ఉంది. ఆయన్ను అనుసరించే వారు తప్పకుండా సాయం చేస్తారని నమ్ముతున్నా’ అని తమ్మారెడ్డి చెప్పారు.




నాలుగేళ్ల నుంచి తెలుగు ప్రజలను బీజేపీ, టీడీపీ మోసం చేస్తున్నాయి. వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారని పవన్ తెలిపారు. వెంటనే పవన్ పిచ్చోడంటూ రాష్ట్ర మంత్రి విమర్శించారు. నాలుగేళ్ల క్రితం ఆయన ఇంటికెళ్లి రెండు గంటలపాటు వెయిట్ చేసి బతిమాలి మరీ ఇదే ముఖ్యమంత్రి మద్దతు పొందారు. మిమ్మల్ని వ్యతిరేకిస్తే పిచ్చోళ్లు అయిపోతారా?’ అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
జనసేన సభ తర్వాత పవన్ కళ్యాణ్‌పై మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా ప్రశంసలు గుప్పించాడు. ఈయన స్పీచ్ ద్వారా టీడీపీ భూస్థాపితం కావడానికి పునాది పడిందని భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ అవినీతి చేశాడా లేదా కాదు..




ఆయన చెబుతున్న వాటిలో నిజముందా లేదా అని చూడాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ ఆమరణ దీక్ష చేపడితే నేను ఆయనతో కలిసి వస్తానన్నారు. జనసేన కాపులతోపాటు దళితులు, మైనార్టీలను కలుపుకొని ముందుకెళ్తానని మేనిఫెస్టోలో ఉంచితే నేను ఆయనతో కలిసి నడుస్తానని కత్తి మహేష్ చెప్పడం గమనార్హం.

Popular posts from this blog

Massive Drone Strikes Rock Ryazan: Explosions Hit Oil Refinery and Airbase Overnight

Passenger Jet Collides Midair with Helicopter Near Washington, Crashes into Potomac River

Pragyan Agra’s Hot Video: The Viral Sensation Taking Social Media by Storm