రాయలసీమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ యాత్ర ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది.
రాయలసీమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ యాత్ర ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది.
చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటిస్తారు. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారు.
1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. దాని తరువాత కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి పయనమవుతారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు
3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
4 వ తేదీ మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రేణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు అక్కడే బస చేస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. తదుపరి స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులూ, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులుపడుతున్నవారికి భరోసా ఇస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
